39.2 C
Hyderabad
April 25, 2024 17: 35 PM
Slider శ్రీకాకుళం

భాషోపాధ్యాయుల బదిలీ సమస్యలను పరిష్కరించండి

#srikakulam

భాషోపాధ్యాయులు బదిలీల్లో ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు, జిల్లా సహాధ్యక్షుడు కుప్పన్నగారి శ్రీనివాసరావులు,సంయుక్త కార్యదర్శి గొడబ  మేరీ ప్రసాద్ లు డీఈవో ఎస్.తిరుమల చైతన్యను కోరారు. ఈ మేరకు వారు వినతిపత్రం అందించారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 కంటే తక్కువ రోల్ ఉన్న కారణంగా బదిలీకి గురైన భాషో పాధ్యాయులకు రీఅపోర్షన్ పాయింట్లు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ యాజమాన్యంలో భాషా పండిత పోస్టులు లేని కారణంగా బదిలీలకు  ఖాళీగా ఉన్న ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ పోస్టులుఖాళీలు చూపించాలని ఆభ్యర్ధించారు. నోషనల్ సీనియారిటీ మంజూరు అయిన DSC 2002 హిందీ పండితులకు నోషనల్ తేదీ నుంచీ సర్వీసు పాయింట్లు మంజూరు చేయాలని కోరారు. డీఈవోను కలిసిన వారిలో జి.వినయ్ కుమార్ , ఎస్.కిరణ్ కుమార్ , ఎస్.వెంకటరమణ తదితరులు ఉన్నారు.

Related posts

కరోనా నివారణకు పుట్లగట్లగూడెం గ్రామాన్ని శానిటేషన్ చేసిన యువత

Satyam NEWS

శతాబ్దాల సంప్రదాయ ఆహారం కుక్క మాంసంపై ఇక నిషేధం..

Sub Editor

డీజీ సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగంపై చర్యలు

Satyam NEWS

Leave a Comment