36.2 C
Hyderabad
April 23, 2024 22: 31 PM
Slider హైదరాబాద్

దళితబంధు లబ్దిదారునికి టాటా ఏస్ గూడ్స్ వాహనం అందజేత

#dalitbandhu

సామాజిక మార్పు కోసమే దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కు చెందిన దళితబంధు లబ్దిదాడు లక్ష్మినారాయణ ఆ స్కీం కింద మంజూరైన టాటా ఏస్ గూడ్స్ వాహనాన్ని స్వయంగా నడిపి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, ఏ ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కాసం మహిపాల్ రెడ్డి ల తో కలిసి లబ్దిదారుడికి వాహన తాళాలు  అందజేశారు.

అందుకుగాను లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఒక్క పథకం మాత్రమే కాకుండా రాష్ట్రంలో సామాజిక మార్పు తీసుకొచ్చేందుకు ఒక గొప్ప ఉద్యమం లాంటిది ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొంది ఇతరులకు ఉపాధి కల్పించే దిశగా ప్రతి దళితులు ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  సుధాకర్ ,మేకల ముత్యం రెడ్డి, డప్పు గిరిబాబు, రెడ్డి నాయక్, జెసిబి రాజు ,యాదగిరి, మొగులయ్య, కృష్ణారెడ్డి , మంజుల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి 

Related posts

అంగరంగ వైభవంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం

Satyam NEWS

దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి

Satyam NEWS

శేష వాహనం పై ఒంటిమిట్ట కోదండరాముడు….

Satyam NEWS

Leave a Comment