సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం రోళ్లవారి గూడెం గ్రామంలో బక్రీద్ పండుగ సందర్భంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి బుధవారం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్