35.2 C
Hyderabad
April 24, 2024 14: 35 PM
Slider నల్గొండ

పరిమళించిన మానవ హృదయం:ట్రై సైకిల్ బహుకరణ

#hujurnagar

త్రిచక్ర సైకిల్ బహుకరించిన మన్నెం శ్రీనివాస రెడ్డి

9వ తరగతి చదువుతున్న విద్యార్ధి మీసాల ఉపేందర్ కు గ్రామ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిల్ ను సోమవారం అందించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రము లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ,తరగతి చదువుతున్న ఉపేందర్ తాను పడుతున్న తీవ్ర ఇబ్బందులు గమనించిన సర్పంచ్  మన్నెం శ్రీనివాస రెడ్డి మానవ సేవే మాధవ సేవగా భావించి బ్యాటరీతో నడిచే 40వేల రూపాయలు విలువ చేసే త్రిచక్ర సైకిల్ ను బహుకరించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండేటి సుధాకర్ రెడ్డి,టిఆర్ఎస్ నాయకులు కుమ్మరికుంట్ల వెంకటనారాయణ, వల్లపుదాసు బాలకృష్ణ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

త్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

పారామెడికల్ సిబ్బందిని ఇప్పటికైనా పర్మినెంటు చేయండి

Satyam NEWS

జై జవాన్ కాలనీలో నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

గుజరాత్ లో ఒక్క అవకాశం ఇవ్వండి: కేజ్రీవాల్

Satyam NEWS

Leave a Comment