త్రిచక్ర సైకిల్ బహుకరించిన మన్నెం శ్రీనివాస రెడ్డి
9వ తరగతి చదువుతున్న విద్యార్ధి మీసాల ఉపేందర్ కు గ్రామ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిల్ ను సోమవారం అందించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రము లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ,తరగతి చదువుతున్న ఉపేందర్ తాను పడుతున్న తీవ్ర ఇబ్బందులు గమనించిన సర్పంచ్ మన్నెం శ్రీనివాస రెడ్డి మానవ సేవే మాధవ సేవగా భావించి బ్యాటరీతో నడిచే 40వేల రూపాయలు విలువ చేసే త్రిచక్ర సైకిల్ ను బహుకరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండేటి సుధాకర్ రెడ్డి,టిఆర్ఎస్ నాయకులు కుమ్మరికుంట్ల వెంకటనారాయణ, వల్లపుదాసు బాలకృష్ణ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్