28.7 C
Hyderabad
April 25, 2024 03: 37 AM
Slider విశాఖపట్నం

విశాఖ మన్యంలో గిరిజన బాలిక అనుమానాస్పద మృతి

#tribal girl

విశాఖజిల్లా,చీడికాడ మండలం లో గిరిజనబాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపింది. చీడికాడ మండలం కుసర్లపాడు గ్రామానికి చెందిన దేవుడమ్మ 14 సంవత్సరాలు 9 వ తరగతి చదువుతుంది.

నిన్న మధ్యాహ్నం నుంచి  ఆ ప్రక్క గ్రామం అయిన పనసపట్టు గ్రామానికి చెందిన నమ్మి కుమార్ అనే యువకుడు తో సన్నిహితంగా కలసి తిరగడం స్థానికులు చూసారు. సాయంత్రం 6 గంటలకు దేవుడమ్మ శవమై కనిపించటంతో అంత కన్నీరు మున్నీరుగా విలపించారు.

  తన స్నేహితుడు నన్ని కుమార్ ఆమెను స్వయంగా  మోసుకొని తీసుకొని వచ్చి ఇంటిదగ్గర పడేసి మీ అమ్మాయి ఉరివేసుకొని చనిపోయిందని చెప్పుటంతో  పోలీసులకు పిర్యాదు చేసారు.దీనితో రంగ ప్రవేశం చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు మైనర్ బాలురు కావటంతో పోలీసులు మరింత జాగ్రత్తగా విచారణ చేపడుతున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ఏరియా ఆసుపత్రికి పంపించారు.

అనుకోని సంఘటనతో ఆ ప్రాంతంవాసులంతా భయాందోళనకు గురిఅయ్యారు

Related posts

పార్టీ పటిష్టతే లక్ష్యంగా కన్వీనర్లు, గృహసారథుల నియామకం

Bhavani

క్వారంటైన్ కు చేరుకున్న కువైట్ ప్రవాసాంధ్రులు

Satyam NEWS

న్యూ ఏజెండా:దేశంలో జనాభా నియంత్రణే ఆరెస్సెస్ ఏజెండా

Satyam NEWS

Leave a Comment