ప్రపంచ మేధావి, భారత రత్న, రాజ్యాంగ నిర్మాత , న్యాయవాది, ఆర్థిక శాసత్రవేత్త, సంఘ సంస్కర్త, రాజ్యాంగ శిల్పి , రాజకీయ నేత డా బి. ఆర్. అంబేద్కర్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన నివాళి అర్పించారు.
హైదరాబాద్ కూకట్ పల్లి కె పి హెచ్ బి 4 ఫేజ్ 114 డివిజన్ లో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
కులమతాలకు అతీతంగా మహనీయులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన ప్రతి భారతీయుడు తమ హక్కుల పోందుతూ ఉన్నారని వక్తలు అన్నారు. కనుక ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి కృషి చేయాలని కోరారు.
ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షలు ఎస్ కె సత్తార్, ప్రధాన కార్యదర్శి అట్లూరి దీపక్, భాష తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.