భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాల సమున్నత అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంఛార్జి చదలవాడ అరవింద బాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టా కిరణ్, బండరుపల్లి విశ్వేశ్వరరావు, గూడూరు శేఖర్, చల్లా సుబ్బారావు,పెరికల రాయప్ప, బాలు, సల్మాన్, మాబు ,శ్రీను, శ్యం,మల్లీ,జంగాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అక్షరాన్ని ఆయుధంగా మలిచి భారతీయ జ్ఞానాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత మూర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా అరవింద బాబు అన్నారు.
దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాలమేడలు రంగులు గోడలు కాదు అని… ప్రతి పౌరుని నైతిక అభివృద్ధి దేశాభివృద్ధి అని చెప్పిన అంబేద్కర్ మాటలు ప్రతి మనిషి అవలంబించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.