39.2 C
Hyderabad
March 28, 2024 14: 52 PM
Slider కర్నూలు

విధి నిర్వహణలో మృతి చెందిన హోమ్ గార్డుకు నివాళి

నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం గుండంపాడు గ్రామానికి చెందిన హోంగార్డు శేఖర్ ఇటీవల నంద్యాలలో విధి నిర్వహణలో మృతి చెందాడు. పోలీస్ సమరవీరుల దినోత్సవం సందర్భంగా హోంగార్డు శేఖర్ సొంత గ్రామమైన గుండంపాడు లో హోంగార్డు శేఖర్ కుటుంబాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, అడిషనల్ ఎస్పీ రమణ, హోమ్ గార్డ్ కమాండెంట్ మహేష్ కుమార్, ఆర్ ఐ సుధాకర్, సిరివెళ్ల సిఐ చంద్రబాబు నాయుడు, ఎస్సై శరత్ కుమార్ రెడ్డి పోలీస్ సిబ్బంది పరామర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు కుటుంబాన్ని ప్రభుత్వాన్ని అన్నివిధాల ఆదుకుంటుందన్నారు. పోలీస్ శాఖ తరపున తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని చెప్పారు. విశ్రాంతి లేకుండా సేవలందించే ఏకైక ప్రభుత్వ శాఖలో పోలీస్ శాఖ ఒకటి ని అన్నారు.

నేడు పోలీస్ అమరవీరుల దినోత్సవం వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసిఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

కొల్లాపూర్ లో యాదవులపై నయీమ్ గ్యాంగ్ వరుస దాడులు

Satyam NEWS

రైతు కూలీలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

Satyam NEWS

జాగృతి ఆధ్వర్యంలో21న యూకేలో బతుకమ్మ సంబరాలు

Satyam NEWS

Leave a Comment