కరోనా మహమ్మారి కి బలైపోయిన జర్నలిస్టు ముద్దుబిడ్డ మనోజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ముషీరాబాద్ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రామ్ నగర్ చౌరస్తా లో కొవ్వొత్తుల నివాళి అర్పించారు.
మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని పోలీసులు డాక్టర్లు మాదిరిగా జర్నలిస్టులు కూడా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎర్రం నర్సింగరావు, బొల్లం శ్రీనివాస్, సిహెచ్ వీరారెడ్డి, కనకరాజు, సతీష్, శివ, నరసింహ , వీరన్న, జహంగీర్, లక్ష్మీనారాయణ ,రహీం, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.