సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని, సమాజానికి, ఎందరో రాజకీయ నాయకులకు రాజకీయ భిక్ష పెట్టిన రాజకీయ దురంధరుడు, పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నీరుకొండ సతీష్ బాబు అన్నారు. మంగళవారం స్వర్గీయ నందమూరి తారక రామారావు 26 వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లోనీ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో లో టి.యన్.టి.యు.సి ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి పసల ప్రసాద్. సీనియర్ నాయకులు మువ్వ శ్రీనివాసరావు వెంకటేశ్వర రావు., కృష్ణ, చారి ,శ్రీనివాస రావు బొప్పన శ్రీనివాస్, సారధి, రవీంద్ర, రమేష్, శంకర్, నాగేశ్వరరావు, తెలుగు యువత నాయకులు బోళ్ళ వెంకటేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి