గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి, పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో వీరయ్య చౌదరి సేవలు కొనియాడారు. సంగం డైరీ ద్వారా పాల ఉత్పత్తి కి రైతులకు ఎంతో మేలు చేసారని అని అన్నారు.
స్వర్గీయ పరిటాల రవీంద్ర రాయలసీమ సింహం అని భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడని అన్నారు.
పేద వారికి ఆయన ఎంతో సేవ చేసారని వారి మరణం పార్టీకి తీరని లోటు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు కూరపాటి హనుమంతరావు, మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి విశ్వేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్,
వల్లపు నాగేశ్వరరావు,వాసిరెడ్డి రవి, మక్కన్ ఆంజనేయులు, కొల్లి బ్రహ్మయ్య, బడే బాబు, పులిమి రామిరెడ్డి, తిరుమల శెట్టి ఏడుకొండలు,మహమ్మద్ ఆలీ, సుభాని నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.