భారత్ చైనా సరిహద్దులో జరిగిన దారుణ ఘటనలో ఇరవై మంది సైనికులు అమరులైన విషయం విదితమే. వారి ఆత్మకు శాంతి కలగాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టి అమరులకు నివాళులర్పించారు.
రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులకు ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు దర్పల్లి గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం చైనా పట్ల కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సీనియర్ నాయకులు విఠ్ఠల్ రెడ్డి , వెంకట్రాంరెడ్డి ,శివరాజ్ పాటిల్, సిర్సముందర్ గంగాధర్ ,ఎంపిటిసి అవారి సురేష్ ,బాలకృష్ణ ,పత్తి లింగ్ రామ్ ,జీవన్ తదితరులున్నారు.