జూలై 4న అమరులైన మహానుభావులను శ్రీకాకుళం పట్టణంలో స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా, డచ్ భవనం వద్ద సిక్కోలు వాసులు స్మరించుకున్నారు. స్వామి వివేకానంద, త్రివర్ణ పతాకం రూపకర్త పింగళి వెంకయ్యలను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని జరుపుకున్నారు.
ఆయన చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోడి రామ్మూర్తి యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు , శ్రీకాకుళం జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు డా. గుండబాల మోహన్ మాట్లాడుతూ గొప్ప దేశభక్తుల ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర సచివాలయం క్రీడా సంఘం అధ్యక్షులు కే. మురళి, వ్యాయామ ఉపాధ్యాయులు అయినా కింజరాపు నరేష్, దిలీప్, నాగేశ్వరరావు, యడ్ల రామారావు, అప్పలరాజు, రాజశేఖర్, మధు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.