ఒక వైపు దేశ స్వాతంత్య్రం కోసం, మరోవైపు సామాజిక సమానత్వం కోసం పోరాడి వివక్షను జయించిన పోరాట యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ అని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు అన్నారు.
రేంజ్ కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.