బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘన నివాళి అర్పించారు. తాడేపల్లిలోని నివాసంలో బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రం సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.