36.2 C
Hyderabad
April 25, 2024 19: 32 PM
Slider గుంటూరు

దళితులపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం

#aravindababu

దళితుల పై దాడి చేసి, వారి పైనే అట్రాసిటీ కేసులు పెట్టే జగన్ రెడ్డి ప్రభుత్వం పై పోరాడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. అదే సమయంలో దళితులపై దాడులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్య మూర్తి, భారత్ మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్య మూర్తి,భారత్ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నానంటూ తెలిపారు. దళిత హక్కుల పరిరక్షకులు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని సూచించారు.

సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం దళిత జాతిని జాగృతం చేసిందని, దళితులకు విద్య,ఉపాధి,గౌరవం,రక్షణ అనే లక్ష్యంతో తెలుగుదేశం ఎప్పుడూ పని చేసిందన్నారు. 2.74 లక్షల మంది దళిత యువత ప్రభుత్వ రుణ సదుపాయాంతో వ్యాపారాలు చేసినా, రోడ్లు,మౌలిక సదుపాయాలతో దళిత కాలనీల్లో వెలుగులు నిండినా అధి తెలుగుదేశం హయాంలోనే అంటూ డా౹౹చదలవాడ పేర్కొన్నారు.

బడుగు జాతి బిడ్డల భవిష్యత్ కాలరాస్తున్న ప్రభుత్వం పై తిరుగుబాటుకు దళిత వర్గం సిద్ధంగా ఉండాలని డా౹౹చదలవాడ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొట్ట కిరణ్,గొట్టిపాటి జనార్దన్ బాబు,కుమ్మేత కోటి రెడ్డి,జి.పి కుమార్,చితిరాల బాలు,గిద్దల వెంకటేశ్వర్లు,అమర్నాధ్,కె.మధు,బంగారం,మరియబాబు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Related posts

యమ డేంజర్:నిర్మల్ లో డిటోనేటర్ పేలుడు

Satyam NEWS

మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు

Satyam NEWS

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు యువత సన్నద్ధులై ఉండాలి

Satyam NEWS

Leave a Comment