ఇటీవల మరణించిన ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు, వల్లభనేని జనార్ధన్ లకు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు అలుముకుంటున్నాయి. సినీప్రముఖులు ఒకరి తరవాత ఒకరు కాలం చేయడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఈ తరుణంలో తెలుగు సినీపరిశ్రమ ఒక సంతాపసభను నిర్వహించింది. కైకాల సత్యనారాయణ, చలపతిరావు, వల్లభనేని జనార్ధన్ సంతాప సభకు విచ్చేసిన పరుచూరి గోపాలకృష్ణ అధ్యక్షత వహించారు.
ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి, సెక్రెటరీ దామోదర ప్రసాద్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కళ్యాణ్, సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్, డైరెక్టర్ బి.గోపాల్, నిర్మాత డి వి కే రాజు, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సెక్రెటరీ కాజా సూర్యనారాయణ, చలపతి రావు కుమారుడు రవి బాబు, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్, మరో నిర్మాత ఆచంట గోపీనాథ్, రైటర్ సాయినాథ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సెక్రెటరీ మాదాల రవి, రామ సత్యనారాయణ, దర్శకుల సంఘం నుండి కాశీ విశ్వనాథ్, నిర్మాతలు సుబ్బారెడ్డి, వై వి ఎస్ చౌదరి ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు తో సాంకేతిక నిపుణులు హాజరై నివాళులర్పించారు.