ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు,మాజీ సి.ఎం కొణిజేటి రోశయ్య మృతికి ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు ప్రధాన రహదారిపై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మేళ్ళచెరువు ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు ఓరుగంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోశయ్య అనేక అత్యుత్తమ పదవులను నిర్వహించి, కాంగ్రెస్ పార్టీలో, ప్రజలలో అందరి మెప్పును పొందారని అన్నారు. వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉండి భుజంపై కండువా, ముఖముపై చిరునవ్వుతో అచ్చమైన తెలుగు పంచ కట్టుతో క్రమశిక్షణకు మారుపేరుగా ఎదిగారని,ఏ పదవిలో ఉన్న ఎంత చిన్న వారైనా నోరారా పలకరించే మనస్తత్వం,మచ్చలేని రాజకీయ ప్రస్థానం ఈతరం రాజకీయ నాయకులకు ఆదర్శ నాయకుడని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి తెలుగు బిడ్డ వైశ్య జాతికే వన్నె తెచ్చిన మహానుభావుడని,వారితో మేళ్ళచెరువు మండలానికి విడదీయరాని అనుబంధం ఉందని వారిని,వారి ఆత్మకు శాంతి కలగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరగాని నాగరాజు,గోళ్ల సంగయ్య,జగన్ మోహన్ రావు,ఓరుగంటి నరసింహారావు, సాయిబాబా, సతీష్, మల్లిఖార్జున్,రామారావు,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్