మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజల గుండెల్లో వెలుగు నింపిన సూర్యుడు అని తెలంగాణ దళిత దండు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బచ్చలకూర బాలరాజు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పోలీస్ స్టేషన్ చౌరస్తాలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బచ్చల కూర బాలరాజు మాట్లాడుతూ పేద ప్రజలు బతుకులలో అక్షరజ్ఞానం లేనటువంటి సమూహానికి అక్షర జ్యోతి వెలిగించిన మహాత్ముడు మహాత్మ జ్యోతిరావు పూలే గారు అగ్రకులంలోని పేదలని మహిళలకు అక్షర జ్ఞాన అందించిన మహనీయుడు మాత్మ జ్యోతిరావు పూలే గారు ఆయనకి శుభ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఈ బుడగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొడగంటి నరసింహ మరియు కార్యక్రమంలో కొల్లాపూర్ నియోజక వర్గ అధ్యక్షులు మల్లె వెంకటస్వామి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు బాటలో ప్రతి ఒక్కరు ప్రయాణించాలని పూలే ఆశయాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కొని అడిగారు. ఈ కార్యక్రమంలో కోలాపుర్ నియోజకవర్గ ఇన్చార్జి జిలకర కృపాకర్ బచ్చలకూర శ్రీనివాసులు బచ్చలకూర రాముడు తదితరులు పాల్గొన్నారు.
previous post