28.2 C
Hyderabad
April 20, 2024 13: 23 PM
Slider వరంగల్

మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

#mulugu

మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా ములుగులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మార్పీఎస్ మహాజన సోషలిస్టు  పార్టీ నాయకులు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన సేవలను  మహాజన సోషల్ పార్టీ ములుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ జన్ను రవి మాదిగ  ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు నెమలి నర్సయ్య మాదిగ  కొనియాడారు

జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఫులే విగ్రహానికి ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ  దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో  పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఫులే సేవలను స్మరిస్తూ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు నెమలి నర్సయ్య మాదిగ మాట్లాడుతూ మహనీయులు మహాత్మ జ్యోతిరావు ఫులే ఆశయాలకు దేశ ప్రజలు సంఘటితంగా అజ్ఞానంపై యుద్ధం చేయవలసిన అవసరం ఉందని మూఢనమ్మకాలను పారద్రోలి సమ సమాజ నిర్మాణమే లక్ష్యంగా మహాజన సోషలిస్టు రాజ్యాధికారమే లక్ష్యంగా మహాజనులందరినీ ఏకంగా ఐక్యంగా సంఘటిత పరిచి భారతదేశ పార్లమెంటరీ విధానాన్ని చేజిక్కించుకోవాలని ఇందులో భాగంగానే భారత దేశ పీడిత వర్గాల దిక్సూచి మహాజన సోషలిస్టు న్యాయ పోరాటాల వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ  నాయకత్వంలో ఉద్యమించాలని ప్రజలకు ప్రజాస్వామ్య వాదులకు మేధావులకు పిలుపునిచ్చారు

కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ ములుగు టౌన్ అధ్యక్షులు మరాఠీ రవీందర్ మాదిగ మహాజన బీసీ సంఘ నాయకులు రఘు మహాజన్ మాదిగ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చుంచు రవి మాదిగ దళిత సంఘ నాయకులు ములుగు టౌన్ మాజీ సర్పంచ్ గుగ్గిళ్ళ సాగర్ మాదిగ  నద్దునూరి రమేష్ ఇనుముల రామస్వామి  నాయకులు  ఓరుగంటి  అనిల్, బోడ రాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం పోలీసు బాస్ ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం…!

Satyam NEWS

బ్రహ్మం సాగర్ నీటిని విడుదల చేసిన కడప ఎంపి

Satyam NEWS

మీడియా కట్: సాక్షి ఉంటే చాలు మీరంతా మాకెందుకు?

Satyam NEWS

Leave a Comment