దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాదు నగరంపై చెరగని ముద్ర వేశారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి అన్నారు. అలాంటి మహా నేత కార్మిక హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేశారని కొనియాడారు. దివంగత నేత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రధమ వర్ధంతి పురస్కరించుకొని లోయర్ ట్యాంక్ బండ్ లో ని పింగళి వెంకట్రాంరెడ్డి హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని నాయిని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు జనం పల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గూడూరు శైలేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post