ఆధునిక భారత దేశాన్ని పునర్ నిర్మించిన మేధావి భారత మాజీ ప్రధాని పీ వీ నరసింహారావు నేటి తరానికి ఆదర్శనీయుడని ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎంఎల్ సి గిడుగు రుద్రరాజు అన్నారు. పీ వీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన నేడు హైదరాబాద్ లోని నెక్లెస్రోడ్లోని పీవీ జ్ఞానభూమిలో పీ వీ నరసింహారావు చిత్రపటానికి నివాళి అర్పించారు.
పీవీ నరసింహారావు తీసుకువచ్చిన భూ సంస్కరణలు, ఆర్ధిక సంస్కరణలు దేశానికి దిక్సూచిగా మారాయని ఆయన అన్నారు. బహు భాషా కోవిదుడైన పీవీ నరసింహారావు భారత విదేశాంగ విధానానికి కూడా నూతన మార్గదర్శనం చేశారని గిడుగు రుద్రరాజు తెలిపారు. అలాంటి మహనీయుడిని నిత్యం తలచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.