28.7 C
Hyderabad
April 25, 2024 05: 47 AM
Slider తూర్పుగోదావరి

ఆధునిక భారత నిర్మాత పీ వీ నరసింహారావు

#Gidugu Rudra raju MLC

ఆధునిక భారత దేశాన్ని పునర్ నిర్మించిన మేధావి భారత మాజీ ప్రధాని పీ వీ నరసింహారావు నేటి తరానికి ఆదర్శనీయుడని ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎంఎల్ సి గిడుగు రుద్రరాజు అన్నారు. పీ వీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన నేడు హైదరాబాద్ లోని నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో పీ వీ నరసింహారావు చిత్రపటానికి నివాళి అర్పించారు.

పీవీ నరసింహారావు తీసుకువచ్చిన భూ సంస్కరణలు, ఆర్ధిక సంస్కరణలు దేశానికి దిక్సూచిగా మారాయని ఆయన అన్నారు. బహు భాషా కోవిదుడైన పీవీ నరసింహారావు భారత విదేశాంగ విధానానికి కూడా నూతన మార్గదర్శనం చేశారని గిడుగు రుద్రరాజు తెలిపారు. అలాంటి మహనీయుడిని నిత్యం తలచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.  

Related posts

విశాఖలో చంద్రబాబు పర్యటన కేసుల్లో 50 మంది అరెస్టు

Satyam NEWS

స్పీడ్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్ కి వ్యతిరేకంగా ఆర్కే బీచ్ లో బైక్ ర్యాలీ

Satyam NEWS

ఆంధ్రాకు వస్తున్న కేంద్ర కరోనా బృందం

Satyam NEWS

Leave a Comment