31.2 C
Hyderabad
April 19, 2024 03: 41 AM
Slider ప్రత్యేకం

బహుభాషా కోవిదుడు… గొప్ప రాజనీతిజ్ఞుడు పివి

#pvnarsimharao

మాజీ ప్రధానమంత్రి పి వి నర్సింహా రావు 17 వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని పి వి మార్గ్ లో పివి జ్ఞాన భూమి వద్ద రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘన నివాళి అర్పించారు. పివి సమాధి వద్ద పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధానమంత్రి గా పి వి నర్సింహా రావు తీసుకొచ్చిన సంస్కరణలతో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. సమర్ధవంతమైన పాలనతో ప్రపంచ దేశాలలో భారత దేశ ఖ్యాతిని చాటిన మహోన్నత వ్యక్తి ఆయన అన్నారు. చెన్న కేశవరెడ్డి రచించిన జాతిరత్న పి వి నర్సింహారావు పుస్తకాన్ని, నూతన సంవత్సర క్యాలెండర్ లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో బాటు మంత్రి మహమూద్ అలీ, MLC సురభి వాణిదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒకే ఒక్క ఫోన్ తో స్పందించారు ప్రాణం నిలిచింది

Satyam NEWS

నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి నీరు విడుదల

Satyam NEWS

నీట్, ఐఐటీ ఔత్సాహిక విద్యార్థులకు యల్ హెచ్ యల్ కంచన ఫౌండేషన్

Satyam NEWS

Leave a Comment