మావోయిస్టు నేత దివంగత పటేల్ సుధాకర్ రెడ్డి 11వ వర్ధంతి ని ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుర్తి రావులచెరువు గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పటేల్ సుధాకర్ రెడ్డి స్తూపం దగ్గర ఆయన సోదరులు పటేల్ శ్రీనివాసరెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు శేషి రెడ్డి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కొరకు పోరాటం చేసిన సుధాకర్ రెడ్డి ఆశయాలను సాధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పటేల్ అరుణ, మాజీ ఎంపిటిసి చంద్రశేఖర్ రెడ్డి ,పటేల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.