సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఇటీవల మరణించిన తెలంగాణ తొలిదశ ఉద్యమ కారుడు,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెండ్యాల కోటేశ్వర రావు చిత్రపటానికి మాజీ టిపిసిసి చీఫ్, నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పెండ్యాల కోటేశ్వర రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధించారు.ఈ ప్రాంతంలో తెలంగాణ తొలి ఉద్యమ కారునిగా, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారని అన్నారు.అనేక సంఘాలకు,సంస్థలకు బాధ్యతలు చేపట్టి తుదివరకు సేవలందించారని కొనియాడారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్