36.2 C
Hyderabad
April 25, 2024 21: 25 PM
Slider తూర్పుగోదావరి

కాకినాడలో పోలీసు అమర వీరులకు ఘన నివాళులు

#kakinadapolice

తూర్పుగోదావరి జిల్లా  కాకినాడలో పోలీసు అమర వీరులకు ఘన నివాళులు అర్పించారు. జిల్లా ఎస్ పి M.రవీంద్రనాథ్ బాబు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి K.కన్నబాబు హాజరయ్యారు.

రాజ్య సభ సభ్యుడు P.సుభాష్ చంద్రబోస్, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతా విశ్వనాధ్, జిల్లా కలెక్టర్ C.హరికిరణ్ జిల్లా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన పెరేడ్ నకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ M.రవీంద్రనాథ్ బాబు  హాజరై  అమర పోలీసులను, వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ స్మృతి పరేడ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులు, పోలీసు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

పేద ప్రజలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

NEW Accelerate Weight Loss Pills 10 Best Weight Loss Pill

Bhavani

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై వచ్చే నెలలో కోర్టు తీర్పు?

Satyam NEWS

Leave a Comment