తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోలీసు అమర వీరులకు ఘన నివాళులు అర్పించారు. జిల్లా ఎస్ పి M.రవీంద్రనాథ్ బాబు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి K.కన్నబాబు హాజరయ్యారు.
రాజ్య సభ సభ్యుడు P.సుభాష్ చంద్రబోస్, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతా విశ్వనాధ్, జిల్లా కలెక్టర్ C.హరికిరణ్ జిల్లా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన పెరేడ్ నకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ M.రవీంద్రనాథ్ బాబు హాజరై అమర పోలీసులను, వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ స్మృతి పరేడ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులు, పోలీసు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.