27.7 C
Hyderabad
April 26, 2024 03: 50 AM
Slider నల్గొండ

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి ఘన నివాళులు

#uttam

నివాళులు అర్పించిన నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ 32వ,వర్ధంతి కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ తన చివరి శ్వాస ఉన్నంతవరకు దేశం కోసం అవిశ్రాంతంగా శ్రమించారని,భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని,నేటి భవిష్యత్ తరాల కోసం ముందుచూపుతో ఆలోచించి ఆనాడే ఐటి రంగానికి పునాదులు వేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు.రాజీవ్ గాంధీ ఆలోచనల వల్లనే ఈరోజు దేశం ఐటి రంగంలో ముందుకు దూసుకెళ్తుందని అన్నారు.40 సంవత్సరాల వ‌య‌సులో భార‌త యువ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజీవ్‌గాంధీ బ‌హుశా ప్ర‌పంచంలోనే అతి పిన్న‌వ‌య‌స్కులైన ప్ర‌భుత్వాధినేత‌ల్లో ఒక‌రని,స్థానిక సంస్థలు,గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేసిన గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ ఆలోచనలను నేటి తరం నాయకులు,కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని ఉత్తమ్ కోరారు.18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ కే దక్కిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ అడుగుజాడలలో నడుస్తూ రాజీవ్ గాంధీ కన్న కలలు సాకారం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైల్వే సౌత్ సెంట్రల్ జోనల్ సభ్యుడు యరగాని నాగన్న గౌడ్, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,పిసిసి సభ్యుడు దొంగరి వెంకటేశ్వర్లు,మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండి నిజాముద్దీన్, మఠంపల్లి మండల అధ్యక్షుడు భూక్య మంజునాయక్,పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి యడవల్లి వీరబాబు,పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు గొట్టెముక్కుల రాములు, జక్కుల మల్లయ్య,మున్సిపల్ కౌన్సిలర్లు కారంగుల విజయ వెంకటేశ్వర్లు,బొల్లెద్దు  ధనమ్మ జైలు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాచిమంచి గిరిబాబు,ఐటీ సెల్ నాయకులు సుంకరి శివరాం యాదవ్,ముషం సత్యనారాయణ,కోలా మట్టయ్య,ఆకారపు సుదర్శన్,ఐ ఎన్ టి యు సి నాయకులు చింతకాయల రాము, చలిగంటి జానయ్య,అజ్మతుల్లా యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రెడపంగు రాము,మాజీ అధ్యక్షుడు కోల్లపూడి యోహాన్,బంటు సైదులు,మఠంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపులి శ్రీనివాస్,నూకల సందీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారను: ఎంపీ ఆదాల

Bhavani

ఆస్ట్రేలియా కార్చిచ్చుపై ఎంపీ సంతోష్‌ కుమార్‌ ట్వీట్

Satyam NEWS

షోకాజ్ నోటీసులు ఇవ్వడం తగదు

Satyam NEWS

Leave a Comment