28.2 C
Hyderabad
April 20, 2024 11: 51 AM
Slider నల్గొండ

ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో రోశయ్య సంతాప సభ

#aryamahasabha

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సంతాప సభ నిర్వహించారు.

ముందుగా రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు ఆర్య వైశ్య సంఘ నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకులలో రోశయ్య ఒకరిని,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి ఏడు మార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా,తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గా పని చేశారని,రోశయ్య లేని లోటు తీరలేదని అన్నారు.2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసి గౌరవించిందని,బహుముఖ ప్రజ్ఞాశాలిగా,కార్యదక్షుడుగా పేరు పొందిన రోశయ్య ఏ పనినైనా నిబద్దతతో చేసేవారని అన్నారు.

రవాణ, గృహనిర్మాణం,హోం శాఖ,ఆర్థిక,రవాణ,విద్యుత్తు,ఆరోగ్య, విద్య,వంటి శాఖలకు మంత్రిగా పనిచేసిన రోశయ్య అజాత శత్రువుగా పేరు గడించారని గుర్తు చేసుకుని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఓరుగంటి నరసింహారావు,పొలిశెట్టి నర్సింహారావు,కుక్కడపు రామ్మోహన్ రావు,గెల్లి అప్పారావు,బచ్చు రామారావు, ఉప్పల రమేష్, ఓరుగంటి నర్సయ్య, ఎస్.శ్రీనివాస్,కె.కోటేశ్వరరావు, మాశెట్టి అనంతరాములు, ఎన్.నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.

సత్యంన్యూస్, హుజూర్ నగర్

Related posts

బీజేపీ కుట్రలకు నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

Bhavani

గర్భాశయ క్యాన్సర్ కు తొలి దేశీయ వ్యాక్సిన్ సిద్ధం

Satyam NEWS

అనాథ బాలబాలికలకు రగ్గులు దుప్పట్ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment