35.2 C
Hyderabad
April 20, 2024 16: 54 PM
Slider హైదరాబాద్

భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఘన నివాళి

#katragadda

భరత మాత దాస్యశుంఖలాలు తెంపి బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దివికేగిన నిప్పు కణిక షాహిద్ భగత్ సింగ్ అని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు.

భగత్ సింగ్ జయంతి పురస్కరించుకుని నేడు ఆమె మైత్రివనం సమీపంలోని సత్యం థియేటర్ చౌరస్తా లో ఉన్న  భగత్ సింగ్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ పేరు వినగానే ప్రతి భారతీయుడి రోమాలు నిక్క పోడుచుకుంటాయని ఆమె అన్నారు.

ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రతి భారతీయుడిలో స్వతంత్ర కాంక్ష నింపిన వీరుడు ఆయన అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలి తో పాటు స్థానిక నాయకులు, స్థానికంగా వ్యాపారం చేసుకునే మార్వాడీ, సిక్కు సోదరులు, భగత్ సింగ్ అభిమానులు  కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో గోపాల్ రావు, శ్రీను, గోవింద్, వాహీద్, సర్దార్ నరేంద్ర సింగ్ రాగి, సర్దార్ సురేంద్ర సింగ్, రాజు భాయ్, సర్ధార్ పర్వేంద్ర సింగ్, సర్ధార్ హార్పల్ సింగ్, సర్ధార్ గుర్వేందర్ సింగ్, సర్ధార్ బలవిందర్ సింగ్, మోను, సర్ధార్ విక్రమ్ సింగ్, సర్ధార్ హరిచారంజీత్, సింగ్ మోంటీ, సర్ధార్ బలవిందర్ సింగ్, పప్పు, సర్ధార్ జగమీథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైసీపీ కార్యకర్తల భూములు ఆక్రమించేసిన వైసీపీ నేత

Satyam NEWS

వ్యవసాయ మోటార్లకు మీటర్లపై వామపక్షాల ఉద్యమం

Satyam NEWS

చేజర్ల మంచినీటి సమస్యకు ఎత్తి పోతల పరిష్కారం

Bhavani

Leave a Comment