34.2 C
Hyderabad
April 19, 2024 20: 25 PM
Slider పశ్చిమగోదావరి

వైయస్సార్ కు ఏలూరులో ఘన నివాళి

#nurjahan

మహానేత వైయస్సార్ ప్రజల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయారని ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. శుక్రవారం స్థానిక బేల్ బ్రిడ్జి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్ద వివి నగర్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్సార్ జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా వైయస్సార్ విగ్రహానికి నూర్జహాన్, ఏఎంసీ చైర్మన్ మంచెం మైబాబు పూలమాలలు వేసి ఘన నివాళులుర్పించారు.

అనంతరం కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చరిత్ర ఉన్నంత కాలం ప్రజల హృదయాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ, పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రజలందరూ అండగా నిలవాలన్నారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సారధ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చొరవ తీసుకోవడంతో పాటు, పార్టీ బలోపేతానికి తామందరూ కృషి చేస్తామని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్ స్థానిక నాయకులు దేవయ్య, కిరణ్, మల్లేశ్వరరావు వివి నగర్ యువత పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

మళ్లీ ముంచుకొస్తున్న మహమ్మారీ: భారీగా కరోనా కేసులు

Bhavani

రెండవ రోజు ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

లార్డ్ బాలాజీ:జమ్ముకశ్మీర్‌లో వెంకన్న ఆలయం

Satyam NEWS

Leave a Comment