మమతా బెనర్జీకి వచ్చిన ఓట్లను చెల్లని ఓట్లుగా ప్రకటించిన కౌంటింగ్ అధికారులు, బిజెపి అభ్యర్ధి సువేందు అధికారికి మాత్రం చెల్లని ఓట్లు కూడా చేర్చినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి తృణమూల్ కాంగ్రెస్ లేఖ రాసింది. ఓట్ల లెక్కింపులో తీవ్రమైన అవకతవకలకు పాల్పడ్డారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.
తక్షణమే ఓట్ల లెక్కింపును మళ్లీ ప్రారంభించాలని వారు కోరారు. ఈవీఎం లలో వచ్చిన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య తేడా ఉందని వారన్నారు.