27.7 C
Hyderabad
April 19, 2024 23: 32 PM
Slider సినిమా

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన నటి త్రిష

Heroine Trisha

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతం గా ముందు కొనసాగుతుంది.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో ప్రముఖ హీరోయిన్ త్రిష మొక్కలు నాటారు.

ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమె తెలిపారు. వాతావరణం పరిరక్షణ మనందరి బాధ్యత కాబట్టి తన బాధ్యతగా ఈరోజు మొక్కలు నాటాను అని త్రిష తెలిపారు.

అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని అభిమానులకు పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

సుప్రసిద్ధ కళా దర్శకులు ఆనంద సాయికి పవన్ కల్యాణ్ అభినందన

Satyam NEWS

గాజుల అలంకారంలో బెజవాడ దుర్గమ్మ

Sub Editor

ఒంటిమిట్ట సీత రామ లక్ష్మణ స్వామి వారికి చక్రస్నానం

Satyam NEWS

Leave a Comment