రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతం గా ముందు కొనసాగుతుంది.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో ప్రముఖ హీరోయిన్ త్రిష మొక్కలు నాటారు.
ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమె తెలిపారు. వాతావరణం పరిరక్షణ మనందరి బాధ్యత కాబట్టి తన బాధ్యతగా ఈరోజు మొక్కలు నాటాను అని త్రిష తెలిపారు.
అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని అభిమానులకు పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.