భారత అండర్ 19 జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు భద్రాచలంకు చెందిన గొంగిడి త్రిష ఎంపిక అయింది. స్వదేశంలో న్యూజిలాండ్తో 5 టీ20ల సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్టులో త్రిషకు చోటు దక్కడం విశేషం. తెలంగాణ నుంచి మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ తర్వాత భారత జట్టులో స్థానం దక్కించుకొన్న క్రీడాకారిణిగా త్రిష అరుదైన ఘనత సాధించింది. జాతీయ మహిళా క్రికెట్ జట్టులో చోటు సాధించడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యసి, రానున్న టోర్నమెంట్స్ లో ఘన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
previous post