31.2 C
Hyderabad
April 19, 2024 03: 51 AM
Slider హైదరాబాద్

టీఆర్ఎస్ అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం బీజేపీ

Sri-1

కాలనీల సమస్యలు తీర్చటంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఉదయం బడంగ్ పేట కార్పొరేషన్ అల్మాస్ గూడ వినాయక హిల్స్ కాలనీలో స్థానికులతో సమావేశమయ్యారు. బడంగ్ పేట కార్పొరేషన్ ఉపాధ్యక్షులు శివారెడ్డి ఆధ్వర్యంలో కాలనీ సమస్యలు, దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరటం ఖాయం అన్నారు.

మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విఫ‌లం

నగర జనాభాకు తగ్గట్టు మౌలిక వసతులు కల్పించడంలో టీఆర్ఎస్ సర్కారు విఫలమైందని అందెల‌ విమర్శించారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాస్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లలో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన శ్రీరాములు యాదవ్ ను ఈ సంద‌ర్భంగా కాల‌నీవాసులు ఘనంగా సన్మానించారు. వినాయక హిల్స్ కాలనీ పెద్దలు. భవిష్యత్తులో బీజేపీ విజయానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని అందెల‌కు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అల్మాస్ గూడ కార్పొరేటర్లు పద్మా ఐలయ్య యాదవ్, రామిడి మాధురి వీరకర్ణారెడ్డి, శూరకర్ణారెడ్డి, టేకుల భాస్కర్ రెడ్డి, జీఎస్ దొడ్డి మల్లికార్జున్, వరికుప్పుల వెంకటేష్, జంగారెడ్డి, బంగారి బాబు, టీ. సంతోష్, దశరథ్ గౌడ్, శ్రీకాంత్, శివరామ్ రెడ్డి సహా బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Related posts

విశాఖ ఎన్ కౌంట‌ర్: త‌ప్పించుకున్న అగ్ర‌నేత‌లు…హెలీకాప్టర్ తో గాలింపు

Satyam NEWS

చేసిన అప్పులో 48 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి?

Satyam NEWS

లోన్ అప్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment