తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నిరంతరం ప్రగతి బాటన పయనిస్తూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉందని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అహర్నిశలూ పని చేస్తున్నారని ఆయన అన్నారు.
టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా యూసుఫ్ గూడ డివిజన్ లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్ పటేల్ పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కరోనా లాక్ డౌన్ సందర్భంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం.