ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఎస్ రావు నగర్ డివిజన్ లోని పల్లె ఎంక్లేవ్ నివాసి, టిఆర్ఎస్ నాయకులు, ప్రముఖ కాంట్రాక్టర్ చల్లగుండ్ల నాగేశ్వరరావు (59) సోమవారం గుండె పోటుతో మృతి చెందారు. మంగళవారం కుషాయిగూడ శాంతివనంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ సము ద్రాల సోమశేఖర చారి, మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి. ఎస్.బోస్, పీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, టిఆర్ఎస్ ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కాసం మైపాల్ రెడ్డి, కమల నగర్ కాలనీ అధ్యక్షులు రాఘవరెడ్డి, నాయకులు మన్నే సుబ్రహ్మణ్యం, కొండూరు మురళి పంతులు తదితరులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మేడ్చల్ సత్యం న్యూస్ ప్రతినిధి
previous post