32.2 C
Hyderabad
April 20, 2024 21: 29 PM
Slider రంగారెడ్డి

కేటీఆర్ జన్మదిన సందర్భంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం

#amanagal

రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణానికి చెందిన సాయికిరణ్ ,అఖిల దంపతుల కూతురు అనారోగ్యంతో బాధపడుతున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కేటీఆర్ జన్మదినం సందర్భంగా వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు పుట్టినరోజు సందర్భంగా శనివారం కడ్తాల, మైసిగండి, గంగుమర్ల తాండ, ఆమనగల్ ఎం పి డి ఓ కార్యాలయం, కల్వకుర్తి పట్టణంలోని లయన్స్ క్లబ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల  వెల్దండ మండలం తిమ్మినోనిపల్లి గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటారు.

కేకులు కోసి ఒక పండగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ  సాయి కిరణ్ అఖిల దంపతుల 38 రోజుల కూతురు రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చికిత్సకోసం  40 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో పేద కుటుంబం అయినవారు చికిత్స చేయించలేక పోతున్నట్లు ఎవరైనా దాతలు తోచిన సహాయం చేయాలని సూచించారు.

విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లమని ఆయన కూడా సానుకూలంగా స్పందించి తన వంతు సహాయం చేస్తానని మాట ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తారక రామారావు హృదయం చాలా సున్నితమైనదని ఎవరు బాధ పడిన చూడలేరని అన్నారు.

అదేవిధంగా వికలాంగుల కోసం స్కూటీలు, మూడు చక్రాల సైకిళ్లు ఇవ్వాలని అందుకోసం రాష్ట్ర ప్రజా ప్రతినిధులు ఆర్థిక స్తోమత ఉన్నవారు  సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కడ్తాల, ఆమనగల్, వెల్దండ మరియు కల్వకుర్తి మండలాల ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Related posts

ఒంటిమిట్ట సీతారాములకు పద్మశాలీయుల పట్టు వస్త్రాలు

Satyam NEWS

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ శ్యాం కోషీ

Bhavani

మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి గంగుల

Satyam NEWS

Leave a Comment