28.2 C
Hyderabad
March 27, 2023 09: 55 AM
Slider తెలంగాణ

నర్సంపేటలో టిఆర్ ఎస్ నాయకుడిపై కత్తులతో దాడి

warangal attack

భూ వివాదం కారణంగా వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది. వరంగల్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేస్తున్న దంపతులపై దాడి జరిగింది. అంబటి వెంకన్న అనే టిఆర్ ఎస్ నాయకుడు, అతని భార్య నడుచుకుంటూ వెళుతుండగా. ఒక్కసారిగా వచ్చిన దుండగులు మొదట వారి కళ్లలో కారం కొట్టారు. తర్వాత తలపై రాడ్డుతో దాడి చేశారు. వెంకన్నను కత్తులతో పొడిచి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకన్నను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వెంకన్నకు.. కుమ్మరికుంటలో ఉన్న దాదాపు 3 కోట్ల విలువ చేసే భూమిపై కొందరితో వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వెంకన్న దంపతులపై దాడి చేసిన దుండగులు నర్సంపేట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.

Related posts

గోపాలపురంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ

Satyam NEWS

ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు 6000తో పటిష్ట బందోబస్తు

Satyam NEWS

అయోధ్య రామాలయం కోసం రఘురాముడి ప్రత్యేక పూజ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!