30.7 C
Hyderabad
April 24, 2024 00: 00 AM
Slider తెలంగాణ

నర్సంపేటలో టిఆర్ ఎస్ నాయకుడిపై కత్తులతో దాడి

warangal attack

భూ వివాదం కారణంగా వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో దారుణం జరిగింది. వరంగల్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేస్తున్న దంపతులపై దాడి జరిగింది. అంబటి వెంకన్న అనే టిఆర్ ఎస్ నాయకుడు, అతని భార్య నడుచుకుంటూ వెళుతుండగా. ఒక్కసారిగా వచ్చిన దుండగులు మొదట వారి కళ్లలో కారం కొట్టారు. తర్వాత తలపై రాడ్డుతో దాడి చేశారు. వెంకన్నను కత్తులతో పొడిచి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకన్నను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వెంకన్నకు.. కుమ్మరికుంటలో ఉన్న దాదాపు 3 కోట్ల విలువ చేసే భూమిపై కొందరితో వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వెంకన్న దంపతులపై దాడి చేసిన దుండగులు నర్సంపేట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.

Related posts

చైనాలో విరిగిపడ్డ కొండచరియలు..

Sub Editor

స్మార్ట్ పేరుతో జగన్ రెడ్డి దగా: ఏపి కాంగ్రెస్

Satyam NEWS

ఎవరికి పుట్టారో తెలియదు….(తిరుపతి దొంగ ఓట్ల కథ)

Satyam NEWS

Leave a Comment