హైదరాబాద్ ఎల్ బి నగర్ మునిసిపాలిటీ జోనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పంకజ కు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, హెచ్ బి కాలనీ కార్పొరేటర్ జెర్రీ పోతుల ప్రభుదాస్ నేడు పంకజను అభినందించిన వారిలో ఉన్నారు. జోనల్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు పల్లా కిరణ్ కుమార్ రెడ్డి , సానాల రవి తదితరులు పాల్గొన్నారు.
previous post