36.2 C
Hyderabad
April 25, 2024 21: 04 PM
Slider హైదరాబాద్

ముస్లింలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

arekepudi gandhi

పాకిస్తాన్ నుంచి వచ్చినా, రాజస్థాన్ నుంచి వచ్చినా మిమ్మల్ని ఎవరూ వెళ్లగొట్టలేరు. మేం మీకు అండగా ఉంటాం అంటూ హైదరాబాద్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను వివాదం రేపుతున్నాయి. అంటే హైదరాబాద్ ముస్లింలలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వారు ఉన్నారని ఆయన పరోక్షంగా చెప్పినట్లయిందని కామెంట్లు చేస్తున్నారు.

నేడు కార్పొరేటర్ తో కలిసి ముస్లింలు ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లను కూడా పంపించం అంటూ ఎమ్మెల్యే గాంధీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్స్, కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రసంగించిన ఓ వీడియో తాజాగా బయటకు వచ్చింది.

అందులో ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సీఏఏ బిల్లుకు తాము వ్యతిరేకమని, సభ పెట్టి, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి కెసీఆర్ చెప్పారని అన్నారు. అంతటితో ఆగకుండా “మీ వద్ద ఏ గుర్తింపు కార్డు లేకపోయినా, పాకిస్థాన్ నుంచి వచ్చినా వెనక్కు పంపించం, మీతో పాటు మేము వస్తాం” అంటూ ఎమ్మెల్యే గాంధీ వ్యాఖ్యానించారు.

దీంతో పాటు సీఏఏకు అనుకూలంగా ఎవరైనా ప్రచారం చేస్తే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలను అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో ఎమ్మెల్యే గాంధీ వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ట్రోల్స్, కామెంట్స్ తో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related posts

బిజెపి ప్రభుత్వం రైల్వేని ప్రయివేటైజ్ చేయడం లేదా?

Satyam NEWS

హుజూర్ నగర్ నుండి దాచేపల్లి కి ఆర్టీసీ బస్సులు నడపాలి

Satyam NEWS

భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Satyam NEWS

Leave a Comment