36.2 C
Hyderabad
April 25, 2024 20: 20 PM
Slider నిజామాబాద్

15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి.. : షబ్బీర్‌ అలీ

#ShabberAli

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత 15 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీమంత్రి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ తెలిపారు.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అందుకే ఆ పార్టీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.

ప్రగతిభవన్‌లో గాడ్సే కొత్త అవతారం విశ్రాంతి తీసుకుంటోందని అన్నారు.   గాడ్సేకు పెద్ద శిష్యుడు లాంటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను దాదాపు ప్రతివారం కేసీఆర్‌ ఎందుకు కలుస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Related posts

మాజీ మంత్రి జానారెడ్డి ని కలిసిన పొంగులేటి

Bhavani

బాధలు అర్ధం చేసుకుని ఏపీ పోలీసులు సహకరించాలి

Satyam NEWS

చెన్నై – సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

Satyam NEWS

Leave a Comment