35.2 C
Hyderabad
April 20, 2024 15: 57 PM
Slider ప్రత్యేకం

27న టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం

#Telangana CM KCR 2

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27 వ తేదీన మాదాపూర్ లోని హెచ్ ఐ సిసి లో నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఉదయం 10 గంటలకల్లా పార్టీ ప్రతినిధులందరూ సమావేశ మందిరానికి చేరుకోవాలని సిఎం తెలిపారు.

వ్యవస్థాపక దినోత్సవంలో హాజరయ్యే ప్రతినిధులు:

రాష్ట్ర మంత్రి వర్గం, రాజ్య సభ లోక్ సభ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ల చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మహిళాకోఆర్డినేటర్లు, జెడ్పీటిసీ సభ్యులు, మున్సిపల్ మేయర్లు మరియు చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, పట్టణాల మరియు మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొంటారు. ప్రత్యేక ఆహ్వానితులు గా.. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు..హాజరవుతారు.

కార్యక్రమ నిర్వహణ వివరాలు :

ఏప్రిల్ 27 బుధవారం ఉదయం 10 గంటలకల్లా ప్రతినిధులందరూ హైద్రాబాద్ మాదాపూర్ నందుగల హెచ్ ఐ సిసి సమావేశమందిరానికి చేరుకోవాలి.

ఉదయం 10 గంటలనుంచి 11 గంటల వరకు ప్రతినిధుల నమోదు.

ఉదయం 11:05 గంటలకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆగమనం.

పార్టీ పతాకావిష్కరణ.

స్వాగతోపన్యాసం

అధ్యక్షుల వారి తొలిపలుకులు

దాదాపు 11 తీర్మానాలు ప్రవేశపెట్టడం

వాటి పై చర్చించి ఆమోదించడం.

Related posts

బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ సీఈవోగా డాక్టర్ కృష్ణయ్య

Satyam NEWS

ఎల్.ఆర్.యస్ అడిగే ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తులు ప్రకటించాలి

Satyam NEWS

పోలీసు సంక్షేమ పాఠశాలకు కంప్యూటర్లు అందజేసిన మైలాన్

Satyam NEWS

Leave a Comment