పార్టీలో తనకు న్యాయ జరగడం లేదని ఆరోపిస్తూ ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రగతి భవన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. జనగామ జిల్లా కోమరవెల్లి మండలానికి చెందిన లక్ష్మణ్ నాయక్ నేడు ఈ పని చేయడంతో ఒక్క సారిగా ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.
పార్టీలో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అతను ఆత్మహత్య యత్నం చేశాడు. తన వెంట రెండు బాటిల్స్ లో డీజిల్ తెచ్చుకున్న లక్ష్మణ్ నాయక్ మీద పోసుకోవడానికి ప్రయత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. వెంటనే అతని చేతిలో నుంచి డీజిల్ సీసాలను లాక్కున్నారు. అతడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.