38.2 C
Hyderabad
April 25, 2024 13: 22 PM
Slider ముఖ్యంశాలు

డ్రామారావులు డ్రామాలను బంద్ చెయ్యాలి : నూనె బాల్ రాజ్

#nunebalraj

తెలంగాణ ప్రజానీకాన్ని టీఆర్ఎస్ పార్టీ మరోసారి మోసం చేయాలని చూస్తుందని బిజెపి స్టేట్ సెంట్రల్ కో ఆర్డినేటర్ నూనె బాల్ రాజ్ విమర్శించారు. రాష్ట్రంలో పండిన పంటలను కొనడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నారు. రైతుల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు.

వరి వేస్తే ఉరే అంటూ చెప్పిన సీఎం కేసీఆర్.. తాను మాత్రం ఎందుకు వరి పండించారని ప్రశ్నించారు. తెలంగాణలో పండిన ప్రతి గింజ ప్రభుత్వం కొనాల్సిందేని తెలిపారు. ధాన్యాన్ని కొని ఎఫ్ సి ఐ కి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అన్నారు. పీకే సలహాలతో పిచ్చి లేసినట్లు టీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు, మాయ మాటలు చెప్పిన తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.

దుబ్బాక, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిన ప్రజలు.. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ను రోడ్ల మీదకు తీసుకువచ్చారని తెలిపారు. డ్రామారావులు ఎన్ని రంగులు ముసుగులు మార్చినా.. సినీ నటుడు రామారావు లాగా కాలేరన్నారు.

బిక్షక బటుడిలా  చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. ఎన్ని డ్రామాలు చేసిన రైతులు పండించిన వడ్లను కొని తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి చేతులు దులుపుకుందామని చూస్తే బిజెపి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు.చివరికి పీకేల వల్ల పీకుడు.. ఎస్కేల వల్ల పిసుకుడే మీ పార్టీలకు మిగిలేదన్నారు.

Related posts

బి ఆర్ ఎస్ ప్రభుత్వం కార్మికులకు కట్టుబడి ఉంది

Satyam NEWS

రెండు పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా

Satyam NEWS

ప్రజల ప్రాణాలు కాపాడేది పోలీసులు కాదు మాస్కులే

Satyam NEWS

Leave a Comment