రాష్ట్రానికి సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు విషయమై పార్లమెంటును, దేశ ప్రజలని, రైతులను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర వాణిజ్య, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పై సభా హక్కుల ఉల్లంఘన(ప్రివిలేజ్ మోషన్) నోటీసును పార్లమెంటు స్పీకర్ కు టీఆర్ఎస్ ఎంపీలు నామ నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బి.బి పాటిల్,మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాలోతు కవిత, వెంకటేష్ నేత, రాములు అందించారు. అలాగే తెలంగాణ రైతాంగం తరుపున ఢిల్లీలోని పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్రంతో కొట్లాడుతాం అని, ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎంపీలు స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న మంత్రిని పార్లమెంట్ తో పాటు ప్రజా క్షేత్రం లో ఎండగడతామని టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు తెలిపారు.
previous post