కామారెడ్డి మున్సిపాలిటీపై గులాబీ జెండా రెపరెపలాడాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా 70 సంవత్సరాల పాలనలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్శీరాములు కల్యాణ మండపంలో టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన మంత్రికి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్బంగా మంత్రి సమక్షంలో పలువురు బీజేపీ, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు టిఆర్ఎస్ లో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… 70 సంవత్సరాల పాలనలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనందరి కళ్ల ముందే కనిపిస్తున్నాయన్నారు. గత ఎన్నికల్లో గెలిచినట్టుగానే ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పారు.
గత ఐదు సంవత్సరాల్లో కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 85 కోట్లతో పలు అభివృద్ది పనులు జరిగాయని తెలిపారు. కామారెడ్డి చరిత్రలో గత ప్రభుత్వాల హయాంలో కామారెడ్డి చరిత్రలో ఇప్పటివరకు ఇన్ని కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు జరిగాయా అని ప్రశ్నించారు. పనులు చేసి ఓట్లు అడిగే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలతో నే మనం ప్రజల ముందుకు ఓట్లు అడిగేందుకు వెళ్లాలని సూచించారు. కామారెడ్డి పట్టణంలో జరిగిన అభివృద్ది చూసి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండని ప్రజలను కోరారు. కామారెడ్డి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేసే భాద్యత మనందరిపైన ఉందని చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో పట్టణాలకు ప్రవేశపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరీధోద్దీన్, జహీరాబాద్ ఎంపీ బిబిపాటిల్, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ లక్ష్మారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.