తెలంగాణ రాష్ట్రం లో నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని గడిల పాలన ను తరిమికొట్టాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. ములుగు జిల్లా కొత్తగూడ మండలం కర్లాయి గ్రామానికి చెందిన 100 మంది టీఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ తెలంగాణను దొరల పాలన నుంచి విముక్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు ఆమె స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చల్ల నారాయణ రెడ్డి,మండల అధ్యక్షులు వజ్జ సారయ్య,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి ఎంపీపీ బానో త్ విజయ రూపు సింగ్,జెడ్పీటీసీ పుల్సం పుష్ప లత శ్రీనివాస్,ఏటూరు నాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,ఎంపీటీసీ వెంకన్న కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ తో పాటు సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.