27.7 C
Hyderabad
April 26, 2024 05: 27 AM
Slider నల్గొండ

ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా టీఆరెస్ పార్టీ

#MLA Chirumarthi Lingaiah

ప్రతీ ఒక్క టీఆరెస్ పార్టీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో  చిట్యాల మున్సిపాలిటీకి చెందిన టీఆరెస్ పార్టీ కార్యకర్తలు ఊట్కూరి శ్రవణ్ కుమార్ రెడ్డి, దేవిరెడ్డి మహేందర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

వారు గతంలో టీఆరెస్ పార్టీ సభ్యత్వం పొంది ఉండగా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక చొరవతో పార్టీ బీమా పథకం కింద ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 4 లక్షల రూపాయల చెక్కులను మంజూరు చేయించారు. మంజూరు అయిన చెక్కులను ఆదివారం రోజు చిట్యాల మున్సిపాలిటీ లో ఎమ్మెల్యే చిరుమర్తి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా టీఆరెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. టీఆరెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ పథకాలు వలనే ఈ రోజు టీఆరెస్ పార్టీపై ఆదరణ కనీవినీ ఎరుగని రీతిలో ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి, వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, నాయకులు మెండే సైదులు, సిలివేరు శేఖర్, పందిరి రమేష్, పొన్నం లక్ష్మయ్య, ఎండీ జమీరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేదల ఇళ్ల స్థలాలు పరిశీలించిన కలెక్టర్ జె నివాస్

Satyam NEWS

బాలివుడ్ నటి రేఖ సెక్యూరిటీకి కరోనా పాజిటీవ్

Satyam NEWS

పరిశ్రమల స్థాపనకు సరైన ప్రతిపాదనలతో రండి…!

Satyam NEWS

Leave a Comment