నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి శివారులోని హాసిని బిపెడ్ కళాశాలలో రాష్ట్రస్థాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిసాయి. ఈ పోటీ పరీక్షలను స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి, పీ సెట్ ఎంట్రన్స్ టెస్ట్ కో-ఆర్డినేటర్ సురగౌని శ్రీనివాస్ గౌడ్, పరిశీలకులు సత్య భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు, జెండా ఊపి ప్రారంభించారు.
పి సెట్ ఎంట్రన్స్ పరీక్షలకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలు ఉదయం 6 నుంచి సాయంత్రం 3:30 నిమిషాల వరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ కో-ఆర్డినేటర్ సురగౌని శ్రీనివాస్ గౌడ్, అబ్జర్వర్ సత్య భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ల, పర్యవేక్షణలో కొనసాగాయి విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలను నిర్వహించి వారి ప్రతిభను పరిశీలకులు గుర్తించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ట్రైనింగ్ ఎస్సైలు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.