టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విభాగాల వారీగా సమీక్షించారు. ఈ నెల 25 నుండి మార్చి 1వ తేదీ వరకు తిరుమలలో నిర్వహించనున్న వేద విద్వత్ సదస్సు ఏర్పాట్లపై రెండు రోజుల్లో ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో టిటిడి ఎఫ్ఏ అండ్ సిఏవో ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ జి.రామచంద్రారెడ్డి, సిఏవో శేషశైలేంద్ర, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విఎస్వో మనోహర్, ఎస్ఇ-2 నాగేశ్వరరావు, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) వేంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్ఆర్.రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.